Tuesday, August 23, 2011

Be Careful - Mobile Phone (collected from AJ Newspaper)

పెట్రోల్‌బంకులు, గ్యాస్ స్టేషన్‌లు, న్యూక్లియర్ ప్లాంట్లు, ఐసీయూలు వంటి రక్షిత ప్రాంతాల్లో మొబైల్ ఫోన్‌లు వినియోగించడం నిషేధం. అయినా నిషేధానికి తూట్లు పొడుస్తూ మనం మొబైల్‌లను యథేచ్చగా వినియోగిస్తూనే ఉన్నాం. నిషేధిత ప్రదేశాల్లో మొబైల్ వినియోగించడం వల్ల ప్రమాదాలకు దారి తీయవచ్చని అంటున్నారు నిఫుణులు. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం...

ఓ కార్పొరేట్ ఆయిల్ కంపెనీలో పెట్రోలియం ఇంజనీరుగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు మార్కెట్‌లోకి వచ్చిన కొత్త మోడల్ మొబైల్ ఫోన్ కొన్నాడు. ఆ సెల్‌ఫోన్‌తో వచ్చిన సేఫ్టీ ఇన్‌ఫర్‌మేషన్ గైడ్‌ను చూడకుండా ఇంట్లో పక్కన పడేసి, ఆ ఫోన్‌ను వినియోగిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ట్యాంకర్ల వద్ద తనిఖీలు నిర్వర్తించాలి. అలా విధి నిర్వహణలో ఉండగా ఓ రోజు హఠాత్తుగా ఓ ట్యాంకరు వద్ద గ్యాస్ లీకైంది. అప్పుడే వెంకటేశ్వరరావు జేబులో ఉన్న సెల్‌ఫోన్ మోగటంతోపాటు భళ్లున శబ్ధం చేస్తూ పేలింది.

అంతే వెంకటేశ్వరరావుతోపాటు ఆయన సమీపంలో ఉన్న నలుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపారు. కేవలం సెల్‌ఫోన్‌ను స్విచ్ఆఫ్ చేయనందు వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు తేల్చారు. ఈ సంఘటన ఇక ముందు అందరికీ గుణపాఠం కావాలని ట్యాంకర్ల వద్ద మొబైల్ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాలి అని బోర్డు పెట్టారు. ప్రమాదాలు జరిగిన తర్వాత మేల్కొనే కంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని కంపెనీలో నిర్ణయించారు.

***ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్ల మంది మొబైల్ ఫోన్‌లను వినియోగిస్తున్నారు. పర్సనల్ కంప్యూటర్లు, టెలివిజన్‌ల కంటే కూడా ఈ ఫోన్‌లు అధికంగా వినియోగిస్తున్నా, వీటి వాడకంలో కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. ప్రపంచంలో ప్రతి సెకండ్‌కు 3,070 కొత్త మొబైల్ ఫోన్‌ల విక్రయాలు సాగుతున్నాయంటే వీటికి పెరుగుతున్న డిమాండ్ ఏమిటో విదితమవుతోంది.

ప్రపంచాన్ని ఆవిష్కరించడంతోపాటు సత్వర సమాచార సాధనంగా, వినోద పరికరంగా, కెమెరాగా ఇలా బహుళార్ధ సాధక పరికరంగా ఉపయోగపడుతున్న మొబైల్ ఫోన్ అరచేతిలో ఇమిడి ఉంటుంది. ఎన్నో రకాల ప్రయోజనాలతోపాటు సమాచార సాధనంగా ఉపయోగపడుతున్న ఈ మొబైల్ ఫోన్‌లను సురక్షితంగా వినియోగించడంలో ముందు జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు పొంచి ఉందని అంటున్నారు నిపుణులు.

ప్రతీ మొబైల్ ఫోన్ వెంట ఇస్తున్న సేఫ్టీ ఇన్‌ఫర్‌మేషన్ గైడ్‌లను ఎవరూ కూడా చదవటం లేదు. ఉత్పత్తిదారులు, సేఫ్టీ నిపుణులు ఇస్తున్న సూచనలను మొబైల్ వినియోగదారులు పాటించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల పలు ప్రమాదాలు వాటిల్లుతున్నాయని పలు అధ్యయనాల్లోనూ వెల్లడైంది. ఈ నేపథ్యంలో నిత్యావసరంగా మారిన మొబైల్‌ఫోన్‌ను కొన్ని జాగ్రత్తలతో వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

*** పెట్రోల్ బంక్‌లో...
మీ కారు లేదా ద్విచక్ర వాహనానికి బంకులో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ గ్యాస్ నింపుకుంటున్నారా? అయితే పెట్రోల్ బంకులోకి ప్రవేశించే ముందే మీ సెల్‌ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ వాహనంలో ఇంధనం నింపుతున్నపుడు సెల్‌ఫోన్ ఆన్ చేసి ఉంటే వచ్చే చిన్న మెరుపు వల్ల క్షణాల్లో పెట్రోల్‌బంకు పేలిపోయే ప్రమాదముంది. పొగతాగడం, అగ్గిపుల్ల వెలిగించటం వల్ల మీ కారు లూజ్ వైరింగ్, ఇంథన పైపు లీకేజీల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముంది.

అందువల్లనే మీరు పెట్రోల్‌పంపుతోపాటు ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమలు, గ్యాస్‌తో పనిచేసే కంపెనీల్లో తప్పనిసరిగా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలి. పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో పనిచేసేవారు మెటల్ పౌడరు, న్యూక్లియర్ ప్లాంట్లు, బోట్లు, కెమికల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు మొబైల్ ఫోన్‌లను పని ప్రదేశాల్లో వినియోగించటం ప్రమాదకరం. రేడియేటర్‌లు, స్టవ్‌లు, వేడినిచ్చే యాంపిల్‌ఫియర్స్‌కు మొబైల్‌ను దూరంగా ఉంచండి.

విమానాల్లో...
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ నిబంధనల ప్రకారం విమానం లేదా హెలికాప్టర్‌లలో ప్రయాణిస్తున్నపుడు రేడియో, వైర్‌లెస్ తరంగాలను పంపించే పరికరాలైన సెల్‌ఫోన్‌లను నిషేధించారు. విమానంలో ఎక్కేముందు సెల్‌ఫోన్‌ను విధిగా స్విచ్ ఆఫ్ చేయాలి. లేకుంటే సెల్‌ఫోన్ తరంగాలతో ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థకు విఘాతం వాటిల్లే అవకాశముంది. దీనివల్ల మీతో పాటు విమానంలో ఉన్న ప్రయాణికులందరికీ ప్రమాదం. ఎయిర్‌క్రాఫ్ట్ నేవిగేషన్, కమ్యూనికేషన్‌ల వ్యవస్థను దెబ్బతీసే సెల్‌ఫోన్‌లను వినియోగించరాదు.

ఆసుపత్రుల్లో...
ఆసుపత్రుల్లో సున్నితంగా ఉన్న వైద్య పరికరాలను ప్రభావితం చేసే సెల్‌ఫోన్‌లను వినియోగించరాదు. దీనివల్ల ఆ వైద్య పరికరాలు సజావుగా పనిచేయవు. దీంతోపాటు పేస్‌మేకర్, హియరింగ్ పరికరాల లాంటి వ్యక్తిగత వైద్య పరికరాలు అమర్చుకున్న వారు ఈ సెల్‌ఫోన్‌లను వినియోగించరాదు. ప్రస్తుతం వస్తున్న ఆధునిక విద్యుత్తు పరికరాలు రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ల సాయంతో పనిచేస్తున్నాయి. అందువల్ల వాటి వద్ద సెల్‌ను వినియోగించరాదు.

పేస్‌మేకర్ తయారు చేసిన కంపెనీతోపాటు ఫిజిషీయన్‌ను సంప్రదించి కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పేస్‌మేకర్‌కు బ్లాక్‌బెర్రీ ఫోన్ ఉన్నవారు దానిని 20 సెంటీమీటర్లు దూరం ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఫోన్‌ను ఛాతీ వద్ద ఉన్న జేబులో పెట్ట రాదు. కొన్ని డిజిటల్ వైర్‌లెస్ పరికరాలు కొన్ని రకాల హియరింగ్ ఎయిడ్‌లను ప్రభావితం చేస్తాయి. వైర్‌లెస్ సర్వీస్ ప్రోవైడర్‌తోపాటు హియరింగ్ ఎయిడ్ ఉత్పత్తిదారును సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్లతోపాటు ఆసుపత్రుల్లో సెల్ వినియోగం నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంది. రోగుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన ఈ సెల్ రేడియేషన్ వల్ల పలు నష్టాలున్నాయని వైద్యులు చెపుతున్నారు. అందువల్ల రోగులే కాదు వైద్యులు, నర్సులు కూడా మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలి. ముందు జాగ్రత్తలు తీసుకొని మొబైల్ ఫోన్‌ను వినియోగిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా ఉంటాయి.
- సలీం
ఇలా చేయండి...
మొబైల్ ఫోన్‌ల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవటంతోపాటు కొన్ని సూచనలు పాటించటం ద్వారా దీనివల్ల కలిగే దుష్పరిణామాలను తగ్గించే అవకాశముందని నిపుణులు అంటున్నారు.
- వాహనంలో పెట్రోల్ నింపే సమయంలో విధిగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేయండి.
- గ్యాస్ స్టేషన్స్ దగ్గర, గ్యాస్ ఫిల్లింగ్ సమయంలో, ఐసీయూలో మొబైల్ ఉపయోగించకండి.
- మొబైల్ ఫోన్ ఉపయోగించడం నిషేధం ఉన్న ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడకుండా ఉండండి.

Tuesday, December 15, 2009

మన ఎం.ఎల్.ఏ. - మన అసెంబ్లీ

మన ప్రస్తుత అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ వారిదా కాక ఆంధ్రప్రదేశ్-ని విడదీయాలని అనుకునే వారిదా?
ఆంధ్రప్రదేశ్-ను విడదీయాలని అనుకునే వారకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్థానం ఉండకూదడే మరి!
ఏంటో ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుచున్నదో ఏమో? ఆ భగవంతుడికే తెలియాలి.

Tuesday, December 8, 2009

చిన్న రాష్ర్టాలతో అభివ్రుద్ది

మన వాళ్ళు చిన్న రాష్ర్టాలతో అభివ్రుద్ది అంటున్నారు, నాకయితే ఉత్తర తెలంగాణ(ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్)కొరకై పోరాటం ప్రారంభించాలని ఉంది.

మీ శ్రీధర్

Tuesday, June 30, 2009

భోజనం చేయు పద్దతి.............

పడకగదిలో పక్కమీద కూర్చొని తినటం - చదువుకున్నముండమోపి గాడిదలు మాత్రమే చేయు పద్దతి

Saturday, June 20, 2009

నేను.......................

నా పేరు శ్రీధర్. మా ఇంటి పేరు సురభి. మా చుట్టాలు బంధువులు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలలో స్థిర నివాసంఏర్పరచుకొని ఉన్నారు. మా తాతగార్లు రోజు పుట్టలేదు కాబట్టి ఏమో, లేక జనాభా తక్కువ ఉండటంవల్లనో కోస్తా, నైజాం అని చూసుకోకుండా వాళ్ళ అమ్మాయిలను అబ్బాయిలను ప్రాంతీయ భేధాలు పట్టించుకోకుండా పెళ్ళిళ్ళు చేసారు.
మా నాన్న గారు సొంతూరుగా చెప్పుకునే ఊరు - పొనుగోడు(గరిడెపల్లి మండలం, నల్గొండ జిల్లా). మా అమ్మ పుట్టిందిపెరిగింది నందిగామ(నందిగామ మండలం, క్రిష్ణా జిల్లా). నేను పుట్టింది నందిగామలోనే, ఇక పోతే పెరిగింది నిజామాబాద్జిల్లాలో; ఉద్యోగరీత్యా నాన్నగారు నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, పెద్ద కొడపుగల్, తాడ్వాయి, కామారెడ్డి (స్థిరనివాసం) మరియు అటుపిమ్మట మరెన్నో చోట్ల పని చేస్తూ ఉద్యోగ విరమణకు దెగ్గరలో ఉండి కామారెడ్డిలో స్థిరపడ్డారు. దురద్రుష్టవశాత్తు నేను నరకం అనదగ్గ అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో దినసరి కూలిగా పని చేస్తున్నాను. (అమ్మానాన్నలకు సేవ చేయక మనము మన అనదగ్గ వాళ్ళకు దూరంగా ఉంటే అదే నిజమయిన నరకం) అమెరికా - భూతా() స్వర్గం;
ఆనాడు అనుకొన్నాను నేను కూడా, ఏనాడైనా మీరు అనుకున్నట్టుగా, కాకపోతే అడుగు పెట్టింతరువాత తెలిసింది --- దూరపు కొండలు నున్నగా ఎందుకు ఉంటాయి అని ఎందుకు అంటారో.
అదండి నా గురించి నా ఉపోధ్గాతం అవును ఎక్కడికో వెళ్తూ ఉన్నాను, కదా క్షమించాలి - ఎందుకంటే క్షమార్హుడినికావున..................................................

ఏమి చేయాలి(ఏదయినా చేయాలి): - నేనేమో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. దురదృష్టవశాస్తు మంత్రాలు కూడా నేర్చుకోలేకపోయాను. కనీసం సంధ్యావందనం అయినా రాకుండా పోయింది. సంధ్యావందనం నేను(బ్రాహ్మణుదిని) చేయవలసింది; నాకొరకు కాదు; నా లోకం కొరకు అని తెలిసినతరువాత మరింతగా నేను లోకానికి నాకు చేతనయింది నేను చేయాలి అనే సంకల్పం మరింతగా పెరుగుతూనే ఉంది. నేను ఏదో సంపాదించుకొని, దానిలో కొంత నేను చేయాల్సిన పనికి కేటాయిద్దామనుకుంటే, నేను సంపాదించుకునేది నావరకే సరిపోతు నా బతుకుబండిని నేను నడిపించుకుంటున్నాను. బ్రాహ్మణుడిగా పుట్టినందులకు నేను యాచన చేయటం తప్పుకాదు. ఒక మంచిపనికోసం ఎవరు యాచన చేసిన తప్పులేదు; యాచన నేనే చేస్తే మంచిపని నేనే చేసాను అనే సంతృప్తి నాకునుదక్కుత్తుంది. నేను నేరుగా చెప్పలేనేమే అనే నా అనుమానం. నీ బ్రతుకు నువ్వు చూసుకో చాలు అని అనే నా వాళ్ళునాకు ఉన్నారు. కాబట్టి ఏది ఏమయినా సరే; ఒకసారి అడుక్కుంటే తప్పులేదు, పోయేదేమిలేదు. అయినా నా వాళ్ళు, ముఖ్యంగా నా మిత్రులు, శ్రేయోభిలాషులు నన్ను అర్దం చేసుకుంటారనే అనుకుంటున్నాను.
దానాలలో ఒక మహా దానం విద్యాదానం. రోజు ప్రతీ అర్ధికి, విద్యను అభ్యసించుటకొరకు ధనం మూలం అయి ఉంది. అందుకని ధనం లేని విధ్యార్ధుల కొరకు నేను ఒక ట్రస్టు కామారెడ్డి కేంద్రంగా, నా మిత్రుల అండదండలతో కామారెడ్డివాసూలను భాగస్వాములను చేసి భీద విద్యార్దులకు తోడుగా ఉండటానికై స్థాపిస్తే బాగుంటుంది అనే ఆలోచనమీ ముందుకు తీసుక వచ్చాను.
ముందుగా నా మిత్రులు నా ఆలోచనకు రూపం కల్పిస్తారని ఆశిస్తున్నాను......

ఇంకా ఉంది - మళ్ళీ త్వరలో మీ ముందుకు వస్తాను.
మీ భవధీయుడు.
శ్రీధర్ సురభి.

పని.... నిద్ర

ప్రపంచంలో ఏ దేశంలో చూసినా పని చేయడం పగలే వెలుతురు ఉండగానే చేసుకుంటారు. పని ఎక్కువ అయితే చేయాల్సిన అవసరం ఉంటేనే రాత్రి కూడా చేస్తారు.
అలాగే రాత్రి పని ఉన్నా లేకపోయినా ప్రతి మనిషి నిద్రించేది రాత్రి సమయంలోనే... పగలు పనిని వదిలేసి పరుండడు. రాత్రి నిద్ర పోయే సమయంలో పని ఉన్నా నిద్రను మాత్రం ఆపలేడు. రాత్రి సమయంలో పని చేస్తే పగలు పది మంది పని చేస్తుంటే; ఈ మహా మనిషి నిద్రపోతాడు. పనికిమాలిన వాడయితాడు.
మనం భారతీయులం మనదేశంలో పగలు రాత్రి పని చేస్తున్నారు. పక్క దేశాలకు వెళ్ళి వాల్లకోసం (వాళ్ళను ధనవంతులను చేయుటకు) పగలు పనిచేస్తున్నాము. అంతే కాకుండా రాత్రి మన పనులకోసం లేచి ఉంటున్నాము.
ఏ పని చేసే సమయంలో ఆ పనే చేయాలి. వాటిని క్రమం తప్పిస్తే శిక్ష పడుతుంది (దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది -ఆరోగ్యం చెడిపోవటం అనేది శిక్ష అనే నా భావన).
ఈవిధంగా చేయటం వల్ల మనకు మన దేశానికి మనం చేస్తున్న మేలు ఏంటో మనకే(మీకే తెలియాలి).

-------------సర్వేజనా సుఖినో భవంతు
--------------
మీ భవధీయుడు
శ్రీదర్ సురభి.

Tuesday, June 16, 2009

మనిషి................

యంత్రం:
తయారు చేసింది మనమే... పనిచేయిస్తుంది మనమే
చెప్పినట్టుగా వింటుంది... చెప్పినట్టుగా చేస్తుంది.

జంతువు:
మనలాగే తయారు చేసాడు పైవాడు..... మనకోసమే మాటనివ్వలేదు ఆ పైవాడు
కొన్నిమనం చెప్పినవి వినకపోయినను... మరికొన్ని అయినా మనకోసమో మరివాటికొరకో మనం
చెప్పినట్టుగా వింటాయి....చెప్పినట్టుగా చేస్తాయి.

మనిషి:
చెప్పినట్టుగా వినడు... చెప్పినట్టుగా చేయడు
తోచిందే చేస్తాడు.... (దేనికోసమో) తొందరపడతాడు..
తింటాడు తొంగుంటాడు... ఏమి చేస్తున్నానో అని ఆలోచిస్తాడు..
ఏదో చేసానని అనుకుంటాడు... ఏమిచేయలేదని తెలుసుకుంటాడు
ఏదో చేద్దామనుకుంటాడు... మళ్ళి తింటాడు తొంగుంటాడు.

మనిషి తయారుచేసిన యంత్రం పనిచేస్తుంది... మనిషి చెప్పినమాట వినే జంతువు పని చేస్తుంది....
మనిషి తనకు తాను తన కోసం తన మనసుకు చెప్పుకున్న మాటనే వినలేక..
యంత్రంకన్నా పశువుకన్నా ... హీనంగా - హీనాతి హీనంగా బ్రతుకు బండిని ఈడుస్తున్నాడు.

నిన్న గడిచొపోయింది... నేడు గడిచిపోతుంది
గడిచిపోయిన నిన్నటిని అనుభవంగా తీసుకో
నిన్న నీవు సృష్టించిన యంత్రంను ఆదర్శంగా తీసుకో
నీ మాట వినే జంతువుని చూసి నైజాన్ని నేర్చుకో
రాబోవు 'రేపు'ను నేడే ఆదర్శంగా మలుచుకో....

మిత్రులు కోరికలు కాంక్షించాలని కోరుకుంటు...

మీ భవధీయుడు
శ్రీధర్ సురభి.


Tuesday, June 9, 2009

మిధ్య అయిన విధ్య.

మన రాష్ర్టం నుంచి వెళ్ళి రాష్ర్టపతి అయ్యి దేశవ్యాప్త ఉపాధ్యాయ దినోత్సవం జరిపించుకుంటున్న నీలం సంజీవరెడ్డి ఎంతఫీజు కట్టి కార్పొరేట్ పాఠశాలలో చదువుకున్నారు; కార్పొరేట్ కళాశాలలో చదువుకున్నారు. నిన్న మొన్నటి ఆదర్శరాష్ర్టపతి మరియు ..స్. అధికారులు, .పి.స్. అధికారులు ఎక్కడ చదువుకున్నారు.

రావాలి మనలో మార్పు - తేవాలి మన సమాజంలో మార్పు. కార్పొరేట్ సంస్థల్లోని పాఠశాలలు & కళాశాలలు భోధించేవిధ్య ప్రతి విధ్యార్ధికి ఆవశ్యమయితే మన ప్రభుత్వాలు నడిపించే పాఠశాలలు & కళాశాలల్లో అవే భోదనాంశాలు ఎందుకనిలేవు, తేడాలెందుకు.

మన తాహతు మించి మనము చదివించాలా - అవసరమా; అవసరమే అయితే అడుక్కుని డబ్బుసంపాదించుకోవాలిమన కడుపు మాడ్చుకుని (కడుపుమాడ్చుకుంటే - చివరకు చచ్చిఊరుకుంటాము) మన పిల్లలనుఅనాధలుగా(అందుబాటులో ఉన్న ఫీజులతో హాస్టల్లలో(అనాధ శరణాలయంలో పిల్లాడి గురించి అయితే పట్టించుకునేనాధుడే ఉండడు - హాస్టల్లలో పట్టించుకున్న పట్టించుకోనట్టే)) చేస్తున్నాము.

తల్లితండ్రులు ఆలోచించాలి మీరు.......................................

మీ భవధీయుడు
శ్రీధర్.

Sunday, June 7, 2009

సహకరించలేరా!!!!!!!!!!!!!! (.........సంహరించగలరా)

సహకరించండి లేదా మాచావుకు మేమే భాధ్యులము అని రాసి ఇచ్చి, మీ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండండి. మా చావును మీరు నిర్ణయించకండి.
మా ప్రభుత్వమా ఇట్టి మా భారతీయుల ఫోటోలను ప్రతీ దిన పత్రికలల్లో ప్రచురించండి.
(ఆయుధం ఉంటేనే చంపగలిగేవారు తీవ్రవాదులు - ఆయుధం లేకున్నను చంపగలిగేవారు ఇలాంటి ప్రభుధ్ధులు - అలాంటి వారిని ఆయుధంతో చంపినా తప్పులేదు).

మీ మంచికోరే
మీ శ్రీధర్.

Tuesday, June 2, 2009

అమ్మే అతి........... :)

పాలలో పంచదార - కూరలో ఉప్పు
-------అబ్బో లేకపోతే రాదు రుచి
పంచదార, ఉప్పు వాటి పాల్లలో వాటిని ఉంచక, కలుపుతూ పోతు ఉంటే రుచి పాడవుతుంది; వెగటుకూడా పుడుతుంది.

నేను మొన్న ఈ మధ్యనే ఈత నేర్చుకున్నాను. త్వరగా నేర్చుకోవాలని రెండు రోజులు వరసపెట్టి పొద్దుట సాయంత్రం వెళ్ళాను. అంతే వాంతులే వాంతులు. అప్పుడు మళ్ళి అనుకున్నాను ఏదయినను అతి పనికి రాదని.
మన భారత జట్టు సభ్యులు ఐ.పి.ఎల్. అంటూ పనికివమాలిన మ్యాచ్-లు ఆడుతూ ప్రపంచంలోని మిగతా జట్ల కన్నా మాములు మ్యాచ్-లతో సహా అతిగా ఆడుతూ వచ్చింది......... అలసిపోయింది.........ఓడుతూ వస్తుంది. మిగిలిన మ్యాచ్-లో అయినా గెలుస్తుందో చూడాలి. నా ఉద్దేశం ప్రకారం మన బిసిసిఐ-దే వ్వూహత్మక తప్పిందందంగా తోస్తుంది.

దేనికయినా క్రమశిక్షణ అనేది ఉండాలి.